మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన
14 Sep 2017 6:53 PM
పుంగనూరు టౌన్: వైయస్ఆర్ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన పుంగనూరులోని 4 వ వార్డులో వైయస్ఆర్ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సభ్యత్వ నమోదు కోసం స్వచ్ఛందంగా ఇళ్లకు రమ్మని ఆహ్వానిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలో కూడా ప్రతిచోటా ఇదే విధంగా ఉందన్నారు. శాసనసభ్యులు, కో-ఆర్డినేటర్లు ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. అక్కడ బూత్ కమిటీ సభ్యులందరినీ కలిసే విధంగా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. అలాగే అక్టోబర్ 27 నుంచి ఆయన పాదయాత్ర ఉంటుందన్నారు. నవరత్నాల సంక్షేమ పథకాలపై కొంతమంది మరిన్ని సూచనలు ఇచ్చారన్నారు. వాటన్నిటినీ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత ఎన్నికల ముందు రూపొందించే మేనిఫెస్టోలో పథకాలను చేర్చుతామన్నారు.