కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
సర్వేల పేరుతో పథకాల ఎగవేత
13 Dec 2016 11:28 AM
విశాఖపట్నంః జీవీఎంసీ 38వ వార్డులో వైయస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పింఛన్, రేషన్ లాంటి పథకాలకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపై వారు మండిపడ్డారు. సర్వేల పేరుతో పథకాలను కుదించి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందకుండా చేస్తోందని తైనాల ఫైర్ అయ్యారు. పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఇళ్లు మంజూరు కావడం లేదని, నేటికీ హుద్ హుద్ పరిహారం అందలేదని పలువురు వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తైనాల వారికి హామీ ఇచ్చారు.