సర్వేల పేరుతో పథకాల ఎగవేత

విశాఖపట్నంః జీవీఎంసీ 38వ వార్డులో వైయస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పింఛన్, రేషన్ లాంటి పథకాలకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపై వారు మండిపడ్డారు. సర్వేల పేరుతో పథకాలను కుదించి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందకుండా చేస్తోందని తైనాల ఫైర్ అయ్యారు. పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఇళ్లు మంజూరు కావడం లేదని, నేటికీ హుద్ హుద్ పరిహారం అందలేదని పలువురు వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తైనాల వారికి హామీ ఇచ్చారు.


Back to Top