సమస్యల సుడిలో రాష్ట్రం

నెల్లూరు(నాయుడుపేట)) సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేట మున్సిపాలిటీ 19వ వార్డు అగ్రహారపేటలో గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ సరిగా రావడం లేదు. రుణాలు మాఫీ కాలేదు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. టీడీపీ పాలనలో ఒక్క సంక్షేమ పథకం తమ దరికి చేరడం లేదని 19వ వార్డు వాసులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు.  మోసపూరిత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సంజీవయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top