నోట్ల రద్దుతో నరకయాతన

కర్నూలు) పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థిితి నెలకొందని వైయస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ అన్నారు. ప్రజలకు అవసరం మేర కొత్త నోట్లు అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 46వ వార్డులోని చల్లా కాంపౌండ్, నెహ్రూనగర్ లో హఫీజ్ ఖాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తాగునీటి కష్టాలు, వీధిలైట్లు, మురుగు కాల్వలు తదితర సమస్యలను విన్నవించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హఫీజ్ ఖాన్ చెప్పారు.  


Back to Top