అవినీతి పాలనపై ఆగ్రహం

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ బుర్రా మధుసూదన యాదవ్ ఆధ్వర్యంలో  పామూరు మండలం బలిజపాలం గ్రామంలో గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమం సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుర్రా ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అవినీతి, అరాచక పాలనను బుర్రా ప్రజల వద్ద ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను వంచించాడని బుర్రా మండిపడ్డారు. 


Back to Top