రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
ఇంటింటికీ ప్రజాబ్యాలెట్ పంపిణీ
02 Feb 2017 4:49 PM
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్లు ఆయా గ్రామాల్లో పర్యటిస్తుండగా స్థానికులు ఘన స్వాగతం పలికి, తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ నేతలు ఇంటింటా పర్యటించి పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్ను పంపిణీ చేసి చంద్రబాబు మోసాలను ఎండగడుతున్నారు. అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న పోరాటాలను వివరిస్తున్నారు.
* కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట మండలం లింగాలగట్టు గ్రామంలో పార్టీ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి పర్యటించారు.
* ప్రకాశం జిల్లా గూడ్లురు మండలంలోని పాజర్ల పంచాయతీలో కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో గూడ్లురు జెట్పిటిసీ వెంకట్ రామిరెడ్డి , కందుకూరు రూరల్ యూత్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు , గూడ్లురు కన్వీనర్ శ్రీ కృష్ణ , యూత్ కన్వీనర్ శ్రీ కిశోర్ , బి.సి సెల్ కన్వీనర్ శ్రీ నరసింహ , మాల్యాద్రి , పుల్లయ్య, నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు పట్టణం బాపుజీ కాలనీలో పార్టీ ఇన్చార్జ్ వరికూటి అశోక్బాబు ఇంటింటా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
* శ్రీకాకుళం జిల్లా మెలిపుట్టి మండలం మెరడికోట పంచాయతీలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసాలను ఆమె వివరించారు.
* అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.