కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ఏపీలో అవినీతికి పీఎం లైసెన్స్
13 Jul 2016 2:28 PM
నెల్లూరులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్
బాబు రెండేళ్ల పాలన అంతా శూన్యం
టీడీపీ నేతలు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు
వైయస్సార్సీపీ నేతలు ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని
నెల్లూరు : అవినీతిని నిర్మూలిస్తామని పదేపదే చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీలో మాత్రం అవినీతికి లెసైన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గ్రామంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నందున ప్రస్తుతం చంద్రబాబు అవసరం మోదీకి లేదన్నారు. కానీ, నరేంద్ర మోదీ మాత్రం చంద్రబాబు నాయుడ్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారో ప్రజలకు అర్థం కావట్లేదని తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన చంద్రబాబు...దీని నుంచి బయటపడేందుకు నరేంద్రమోదీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
మోసాలకు కేరాఫ్ బాబూ అండ్ కో..
చంద్రబాబు, లోకేష్లు కలసి రాష్ట్రంలో రూ.1,44,571 కోట్ల అవినీతికి పడగలెత్తారని విమర్శించారు. ఇరిగేషన్లో రూ.7,000 కోట్లు దోపిడీ చేశారని... అలాగే లిక్కర్ సిండికేట్ల నుంచి రూ.6,000 కోట్లు బహుమతిగా వచ్చాయన్నారు. పవర్ ప్రాజెక్టులలో రూ.5,000 కోట్లు ముడుపులు అందుకున్నారని, ఇసుక మాఫియా నుంచి రూ.2,600 కోట్లు వసూలు చేశారని ప్రసన్నకుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు.
'రైతుల భూములు విదేశీయులకు అప్పగిస్తున్న బాబు'
నెల్లూరు :చంద్రబాబుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తాలిచర్లపాడులో కాకాణి గోవర్దన్ రెడ్డి గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుని విదేశీయులకు అప్పగిస్తున్నారని ఫైర్ అయ్యారు. బాబు వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రజలే చంద్రబాబును నిలదీస్తారని ఆయన పేర్కొన్నారు.