మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు
09 Jun 2017 3:18 PM
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేట్ల ఉమాశంకర్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని గోలుగొండ మండలం ఏఎల్పురంలో ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా వారి సమస్యలను ఆయనకు వివరించారు. మూడేళ్లు పరిపాలన పూర్తయినా టీడీపీ సర్కార్ ఒక్క సమస్యను కూడా పరిష్కారం కాలేదని వాపోయారు. జన్మభూమి కమిటీ సభ్యులు అర్హులైన వారికి ఆసరా పథకాలు అందకుండా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రంలో మళ్లీ దివంగత మహానేత రాజన్న సువర్ణ పాలన తిరిగొస్తుందని భరోసా కల్పించారు.