కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం
13 Mar 2017 5:18 PM
శ్రీకాకుళంః చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, నర్తు రామారావులు అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని కంచిలి మండలం నవోదయకాలనీ గ్రామంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా మధ్యలో టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ఫించన్లు, రేషన్కార్డులు లేక అనేక మంది బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరిపాలన కొనసాగించాలని సూచించారు.