టీడీపీ సర్కార్ పై ప్రజాగ్రహం

నందికొట్కూరు)))టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా హామీలిచ్చిందని, అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. గడపగడపకు వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమంలో భాగంగా బానకచెర్ల, బానుముక్కల గ్రామాల్లో పర్యటించారు. పింఛన్‌, రేషన్‌ సక్రమంగా ఇవ్వడం లేదు, పక్కా గృహాల ఊసేలేదు అని ప్రజలు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు.  మోసపూరిత చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఐజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. 

కర్నూలు)))ప్రభుత్వం బంగారు వ్యాపారుల సమస్యలపై దృష్టి సారించాలని వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పాత బస్టాండు సమీపంలోని వెంకటాచలపతి షరాఫ్‌ బజారులో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులకు ప్రజా బ్యాలెట్‌ పత్రాలను పంపిణీ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు పి.జి. నరసింహులు యాదవ్‌ వాటిని పూరించే విధానాన్ని వివరించారు. సెంట్రల్‌ ఎక్సైజ్‌ విధింపుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బంగారు వ్యాపారులు హఫీజ్‌ఖాన్‌కు విన్నవించుకున్నారు. 

పత్తికొండ)) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను నట్టేట ముంచారని, రుణమాఫీ అంటూ మోసగించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని అల్లుగుండు గ్రామంలో వైయస్‌ఆర్‌ సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమానికి మహిళలు, రైతుల నుంచి విశేష సందన లభించింది. నారాయణరెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

తాజా వీడియోలు

Back to Top