బాబు పాలనలో ప్రజలకు తప్పని కష్టాలు

ప్రకాశంః చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ వాడరేవు గ్రామ పంచాయతీలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడపగడపకు తిరిగి తెలుగుదేశం పార్టీ మోసపూరిత పాలనను వివరించారు. అదేసమయంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలపై  కరపత్రాలు అందించారు.  ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను బాలాజీకి మొరపెట్టుకున్నారు. బాబు వాగ్ధానాలు నమ్మి మోసపోయామని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top