నయవంచక పాలన

శ్రీకాకుళంః సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అంటూనే ప్రభుత్వం పేదోడి కంట్లో కారం కొడుతోందని గ్రామస్తులు వాపోయారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ కవిటి మండలం జగతిలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసపూరిత పాలనను వివరించారు. అనంతరం ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయిరాజ్ మాట్లాడుతూ...నయవంచక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. 


Back to Top