రైతుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం


బండిఆత్మ‌కూరు:  భారీ వ‌ర్షాల‌తో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్సార్‌సీపీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ బుడ్డా శేషారెడ్డి విమ‌ర్శించారు. వెంగ‌ళ‌రెడ్డిపేటలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం శేషారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తుఫాను వ‌ల్ల మద్దులవాగు, సంక‌ల‌వాగు, గాలేరు న‌దులు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయ‌ని, రామాపురం, బండిఆత్మ‌కూరు, సంత‌జూటూరు, పార్న‌ప‌ల్లె, సింగ‌వ‌రం త‌దిత‌ర గ్రామాల్లో వేలాది ఎక‌రాల్లో వ‌రిపంట దెబ్బ‌తింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

Back to Top