మోసపూరిత పాలనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంకండి

గుంటూరు(వేమూరు))

రేషన్ కార్డులు, వింతతు, వికలాంగుల పెంఛన్లు ఇవ్వడం లేదని పేద ప్రజలు వైయస్సార్సీపీ నేతల ఎదుట మొరపెట్టుకున్నారు. వైయస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా భట్రిప్రోలు మండలం కోళ్లపాలెంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యమంత్రి నిరంకుశ పాలనను తెలియజేసే కరపత్రాలను అందజేశారు. ప్రజలు గ్రామ సమస్యలను ఏకరువు పెట్టారు. రాష్ట్రంలో అడుగడుగునా మోసపూరిత పాలన సాగుతోందని, రాబోయే రోజుల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని నాగార్జున పిలుపునిచ్చారు.


Back to Top