మహోద్యమంలా `గడపగడపకూ వైయస్‌ఆర్ `

* 5 నెలలుగా నిర్విరామంగా కొనసాగుతున్న కార్యక్రమం
* గ్రామగ్రామాన  ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
* బాబు హామీలతో మోసపోయామాని జనం ఆవేదన 
* చంద్రబాబు పాలనకు సున్నా మార్కులేసిన జనం 
* వైయస్‌ఆర్‌సీపీ నేతలతో 5, 6 తేదీల్లో వైయస్‌ జగన్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఒక మహాయజ్ఞానికి ఐదు నెలలు నిండాయి. గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం పేరుతో ఆయాసం ఎరుగక తిరుగుతున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకుల శ్రమకు, వైయస్‌ జగన్‌ ఆశయానికి ప్రజలు హారతులు పట్టారు. సమస్యలతో అల్లాడిపోతున్న తమ పక్షాన పోరాడటానికి ముందుకొచ్చిన పార్టీ నాయకులకు అడుగడుగునా ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఒక వక్రబుద్ధి ముఖ్యమంత్రి నిజ స్వరూపం జనానికి తెలిసొచ్చింది. మాటల్లో తప్ప చేతల్లో అభివృద్ధి చూపించలేని ఒక అసమర్థుడి పాలనపై ఏపీ ప్రజలకు  అవగాహన వచ్చింది. హామీలు ఇవ్వడమే తప్ప తీర్చే అలవాటు లేని పబ్లిసిటీ పిచ్చోడి చేష్టలకు ఆగ్రహంతో ఊగిపోతున్న జనం పచ్చ దొరలకు  చెప్పు దెబ్బలతో సన్మానం చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. జనం మధ్యన మేకలా చలామణీ అవుతున్న ఒక తోడేలు వికృత పాలనకు జనం చరమగీతం పాడటానికి సిద్ధమయ్యారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలే నేడు చంద్రబాబు మోసాలకు విసిగిపోయి మాకొద్దీ తుగ్లక్‌ పాలన అని ఈసడించుకుంటున్నారు. ఇదంతా ఒక్కరోజులో ప్రజల్లో వచ్చిన మార్పు కాదు. ప్రజల్లో తీసుకొచ్చిన మార్పు.. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు జగన్‌ ఆశయానికి అనుగుణంగా నడుచుకుని సాధించిన అఖండ విజయం. గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై ఈనెల 5,6 తేదీల్లో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేలు,  నియోజకవర్గ సమన్వయకర్తలతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై కథనం..

2016 జూలై 8న మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జన్మదిన సందర్భంగా శ్రీకారం చుట్టిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమానికి దాదాపు ఐదు నెలలు నిండాయి. చంద్రబాబు మోసపూరిత హామీలు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్న విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఉన్నత ఆశయంతో ప్రజలకు మేలు చేయాలని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు బాగా ఆదరించారు. తమ పక్షాన పోరాడటానికి వస్తున్న నాయకులను జనం అక్కున చేర్చుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులను కూడా ప్రజలకు బాగా దగ్గర చేసింది. చంద్రబాబు ఎన్నికల హామీలు పక్కన పెట్టిన విధానం, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ప్రభుత్వం పేదల పట్ల వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ సాగిన ఈ ఆరు నెలల మహోద్యమంలో నాయకులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్‌ అభిమానులు భాగస్వాములై ముందుకు నడిపించారు. 
ప్రధాన హామీలూ నెరవేరలా
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రధాన వాగ్ధానాలు కూడా అమలుకు నోచుకోలేదు. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసి ఓట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చాక హామీల అమలుకు ప్రయత్నం కూడా చేయకపోవడం దురదృష్టకరం. పైగా పలు సందర్భాల్లో మేము చెప్పలేదు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఓటేసిన జనాన్ని ఘోరంగా అవమానించారు. ఆనాడు చంద్రబాబు ప్రచారం చేసుకున్న.. అమలుకు నోచుకోని ఆరు ప్రధాన హామీలు. 
*  రైతు రుణాలను బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాం. (2013 ఏప్రిల్‌ 27న చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభలో)
* అధికారంలోకి రాగానే నెల రోజుల్లో బ్యాంకుల్లోని తాకట్టు బంగారం వెనక్కు ఇప్పిస్తాం
* డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం
* డ్వాక్రా మహిళలకు 1.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
* ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేలు బ్యాంకులు డిపాజిట్‌ చేస్తాం. 
* మూడు సెంట్ల స్థలంతోపాటు రూ. 1.5లక్షలతో అందరికీ ఇల్లు.
* మూడుసెంట్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి లక్షా యాభైవేల ఖర్చుతో ఉచితంగా అర్హులందరికీ పక్కా గృహ నిర్మాణం. 
* పది సంవత్సరాలకు పైబడ్డ గృహాలకు ఒక్కొక్క ఇంటికీ 5వేలతో మరమ్మతులు చేయిస్తాం. 
* ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. అది వచ్చే వరకు నిరుద్యోగ యువతకు 2వేల నిరుద్యోగ భృతి ఇస్తాం
6. ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు.. పదేళ్లు చాలదు.. పదిహేనేళ్లు కావాలి. 

ప్రజాబ్యాలెట్‌తో ప్రజల్లో అవగాహన 
ప్రతి ఇంటి గడపను తొక్కి వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు వెళ్లి అందర్నీ పలకరించి వారి సాదకబాధలను తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వంద హామీలు, ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను సిద్ధం చేసి అందజేశారు. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయాలను చెప్పాలని ఎన్నికల్లో ఇచ్చిన ఏయే హామీలు నెరవేరాయని మీరు అనుకుంటున్నారో చెప్పాలని ప్రజా బ్యాలెట్‌తో శాంతి యుత న్యాయ  పోరాటం చేశారు. ఓట్లేసి గెలిపించాక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై జనాల్లో ఆవేదన పెల్లుబికింది. ఇదే సమయంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు గడపగడపకు కార్యక్రమంతో ఇంటి గడప తొక్కిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు తమ ఆవేదన వెలిబుచ్చారు. దీంతో టీడీపీ నాయకులు దిగిరాక తప్పలేదు. అప్పటిదాకా పైపై మాటలతో కాలక్షేపం చేస్తున్న నాయకుల్లో భయం మొదలైంది. ప్రజల్లో వ్యతిరేకత చూసి దిగిరాక తప్పలేదు. ప్రతిపక్షం ఎక్కడ పుంజుకుంటుందోనని కనీసం చిన్న చిన్న పనులైనా చెయ్యక తప్పని పరిస్థితి టీడీపీ నాయకులకు ఎదురైంది. అక్కడక్కడా పనులు మొదలయ్యే వరకు పరిస్థితుల్లో మార్పువచ్చింది. 
వైయస్‌ఆర్‌సీపీ అండతో తిరగబడ్డ జనం 
గడపగడపకు కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తిరిగి భరోసా ఇస్తుండటంతో జనాల్లో క్రమేణా అవగాహన వచ్చింది. ఎన్నికల హామీలను ఎలా తుంగలో తొక్కారో జనానికి తొందర్లోనే అర్థమైంది. ఓట్లేయించుకుని తమను మోసం చేసిన విధానంపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ప్రజాబ్యాలెట్‌తో ఇంటి ముంగిట్లోకి వస్తున్న నాయకులకు బాధలు వివరించే వారు కొందరైతే... టీడీపీ నాయకుల మాటలు నమ్మి మోసపోయామని చెప్పేవారు ఇంకొందరు. మరికొందరైతే తమ ఆగ్రహాన్ని ఆపుకోలేక చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు. టీడీపీ నాయకులను ప్రశ్నించే సమయం కోసం ఎదురుచూస్తున్న జనానికి మంచి అవకాశం దొరికింది. జన చైతన్య యాత్రల పేరుతో తమ ఊరికి వచ్చిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలను జనం నిలదీయడం మొదలు పెట్టారు. బహిరంగంగా రోడ్డుపై నిలబెట్టి కడిగేశారు. మహిళలు హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నిలదీశారు. కొందరైతే ముఖానే చెప్పేశారు రాబోయే ఎన్నికల్లో మీకు ఓటేసి లేదని. మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. టీడీపీ నాయకులు మా ఊరికి జనచైతన్య యాత్రల పేరుతో వస్తే ఊరుకోమని బ్యానర్లు పెట్టి మరీ హెచ్చరించారు. మొన్నటికి మొన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే మాధవనాయుడికి వ్యతిరేకంగా మహిళలంతా ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని వద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వసం చేశారు. కడప జిల్లా బద్వేలులో మహిళలు ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో ఓ మహిళ సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని అడ్డుకోవాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను గట్టిగా నిలదీసింది. ఇదంతా జనంలో వచ్చిన చైతన్యం అనే కంటే వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధిత ప్రజలకు అండగా ఉంటామని కల్పించిన భరోసా.
Back to Top