ప్ర‌జా సంక్షేమానికి తూట్లు


ప్ర‌త్తిపాడు:  ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమానికి తూట్లు పొడుస్తోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ప‌ర్వ‌త శ్రీ‌పూర్ణ‌చంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న రౌతులపూడి లో ప‌ర్య‌టించి, చంద్రబాబు మోసాల‌ను వివ‌రించారు. చంద్ర‌బాబు ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించి అవినీతి, అక్ర‌మాల‌కు పెద్ద‌పీట వేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అవినీతికి మారుపేరుగా చంద్ర‌బాబు మారార‌ని ఆయ‌న ఆరోపించారు.  అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి, బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 
Back to Top