దిగ్విజయంగా గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం

ప్రకాశంః జిల్లాలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయస్సార్సీపీ శ్రేణులు గడపగడపలో పర్యటిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం సియస్ పురం మండలం v. బైలు పంచాయతీ లోని v.బైలు  ,చేన్నపునాయుని పల్లి (hamlets) గ్రామాల్లో గడప  గడపకు వైయస్సార్ సిపి కార్యక్రమం జరిగింది.  కనిగిరి వైయస్సార్ సిపి ఇన్చార్జి బుర్రా మధుసూధన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి బాబు మోసపూరిత హామీలపై కరపత్రాలు పంపిణీ చేశారు. 

కోమరోలు మండలం రెడ్లచేర్ల గ్రామంలో గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఐ.వి.రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం సాగింది.  

కొండేపి నియోజకవర్గం టంగుటూరు మేజర్ పంచాయతీ రావివారిపాలెంలో అశోక్ బాబు ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం జరిగింది. 


Back to Top