పి.గన్నవరంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం

పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో శనివారం గడప గడపకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం జరిగింది. కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవితో పాటు 70 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 130 ఇళ్లకు వెళ్లి ప్రజా బ్యాలెట్లు పంచారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ గడపకెళ్లినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని చిట్టిబాబు అన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top