సమస్యల విన్నపాలు

అనంతపురం(మడకశిర): గుడిబండ మండలం పీసీగిరిలో గురువారం మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త  డా. తిప్పేస్వామి ఆధ్వర్యంలో గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  వైయస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, మండల కన్వీనర్‌ రాజన్న, స్థానిక వైయస్సార్‌సీపీ నేత డీఎల్‌ యంజారేగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి బాబు అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. చంద్రబాబు మోసపూరిత పాలనపై ముద్రించిన ప్రజాబ్యాలెట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు నేతలకు మొరపెట్టుకున్నారు. పెన్షన్లు, ఇళ్లు, తాగునీటి సమస్యలను వైయస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు.

Back to Top