ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదు

కృష్ణాః పేరుకు మాత్రమే మా ఊరు సంతోషపురమని, టీడీపీ అధికారంలోకి వచ్చాక మా జీవితాల్లో సంతోషమన్నదే లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా కలిదిండి మండలం సంతోషపురంలో కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త డీఎన్నార్ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి బాబు మోసపూరిత హామీలను ఎండగట్టారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. గ్రామంలో ఎక్కడిసమస్యలు అక్కడే తిష్టవేశాయని అన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజులు తదితర సమస్యలను మొరపెట్టుకున్నారు. డీఎన్నార్ మాట్లాడుతూ...ప్రజాసమస్యలు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ప్రజల తిరగబాటు తప్పదని హెచ్చరించారు. 

Back to Top