నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
బాబు పాలనంతా గుండు సున్నా
20 Jul 2016 6:41 PM
రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బొట్టుపెట్టి హారతిచ్చి నీరాజనం పడుతున్నారు. తమ కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన వైయస్సార్సీపీ నాయకులకు సమస్యలు చెప్పుకొని ఆవేదన చెందుతున్నారు. టీడీపీకి ఓట్లు వేసి మోసపోయామని మొరపెట్టుకుంటున్నారు.
రుణమాఫీ కాలేదు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. పింఛన్లు రావడం లేదు. రేషన్ సరుకులు సరిగా ఇవ్వడం లేదు. ఏ ఇంట చూసినా అన్నీ సమస్యలే. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబును రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ప్రజలంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుకు సున్నా మార్కులు వేస్తున్నారు.
ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. వైయస్సార్సీపీని గెలిపించుకుంటామని, వైయస్ జగన్ సీఎం అయితేనే తమ కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.