బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
మోసం చేసిన ఘనత బాబుకే దక్కింది
01 Dec 2016 12:02 PM
కర్నూలు(మంత్రాలయం)) రాష్ట్రంలో రాక్షస పాలన సాగుంతోదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మండిపడ్డారు. మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, మహిళలు సీసీరోడ్లు, తాగునీటి సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా..వాటి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... బాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్రంలో కరువు ఏర్పడిందని అన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు చేతికి అందడం లేదని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అర్హులైన పేదల రేషన్ కార్డులను రద్దు చేయడం సిగ్గుచేటని టీడీపీపై ధ్వజమెత్తారు. రైతు, డ్రాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనత బాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.