రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
త్వరలో మరో విద్యుత్తు ఉద్యమం: వైవీ సుబ్బారెడ్డి
07 Feb 2015 3:59 PM
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్ పెంపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమని ఒంగోలు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తుంటే ఇక్కడ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. మరోసారి విద్యుత్తు ఛార్జీలు పెంచుతున్న బాబు తన గత పాలనను గుర్తుచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపే పలు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. త్వరలోనే విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. కేంద్రంలో మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబురాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తేలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం స్వల్ప మొత్తం ప్రకటించినా సీఎం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మండిపడ్డారు. దీనిపై పార్లమెంటులో పోరాడుతామని స్పష్టంచేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తక్షణమే సాగర్ జలలాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.