ముద్రగడ కు అంబటి పరామర్శ

కాకినాడ: నిరాహార దీక్ష చేసి బాగా నీరసించిపోయిన మాజీమంత్రి ముద్రగడ
పద్మనాభాన్ని వైయస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు  పరామర్శించారు. ముద్రగడ పట్ల ప్రభుత్వం
వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన అన్నారు.  ఈ సందర్బంగా
అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు తల పొగరెక్కి, ఎవరినైనా అణచివేయాలని చూస్తున్నారని అంబటి
మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని తెలిపారు. ముద్రగడ భవిష్యత్ లో
మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ముద్రగడ ఉద్యమానికి అండగా ఉంటామని
భరోసా ఇచ్చారు.

Back to Top