వైఎస్సార్సీపీ కి రెండు మండ‌ల ఉపాధ్య‌క్ష ప‌ద‌వులు

హైద‌రాబాద్) రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండ‌ల అధ్యక్ష ప‌ద‌వులు,  ఉపాధ్య‌క్ష ప‌ద‌వుల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. వీటిలో రెండు మండ‌ల ఉపాధ్య‌క్ష ప‌ద‌వుల్ని వైఎస్సార్సీపీ గెలుచుకొంది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, విశాఖ‌ప‌ట్నం జిల్లా మున‌గ‌పాక‌ మండ‌ల  ఉపాధ్య‌క్ష ప‌ద‌వులు వైఎస్సార్సీపీ ద‌క్కించుకొంది. ఆయా మండలాల్లోని ఎంపీటీసీలు స‌మావేశ‌మైన పార్టీ నాయ‌కుల్ని ఎన్నుకొన్నారు. అనేక చోట్ల వైఎస్సార్సీపీ కి సంఖ్యా బ‌లం ఉన్న‌ప్ప‌టికీ, క్యాంపు రాజ‌కీయాలు న‌డిపి టీడీపీ త‌మ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. 

తాజా వీడియోలు

Back to Top