మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జగన్ రైతు దీక్షకు కదలిరండి
24 Jan 2015 6:14 PM
తూర్పుగోదావరి: రైతులను మోసం చేసిన వారికి, ప్రభుత్వాలకు పుట్టగతులుండవని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు అన్నారు. రుణమాఫీ పేరుతో అన్నదాతలను నట్టేట ముంచిన చంద్రబాబుకు కూడా పుట్టగతులుండవని చెప్పారు. మొగల్తూరులో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఎడ్ల బళ్ల ప్రదర్శన నిర్వహించారు. తణుకు పట్టణంలో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జగన్మోహన్రెడ్డి చేయనున్న దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ ఈ ప్రదర్శన సాగింది. ఈసందర్భంగా కొత్తపల్లి సుబ్బరాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎప్పుడూ ఇంత దయనీయంగా లేదన్నారు.