చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్
09 Mar 2016 10:40 AM
హైదరాబాద్) శాసనసభ నుంచి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. రైతు రుణ మాఫీ అంశం మీద ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప్పులేటి కల్పన ప్రశ్న వేశారు. దీనికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలగచేసుకొని మాట్లాడుతుండగా స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు అబద్దాలు చెప్పి, రుణమాఫీ చేయకుండా తప్పించుకొంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న ప్రభుత్వ తీరుని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ప్రకటించారు. ఆయన నాయకత్వంలో వైఎస్సార్సీపీ సభ్యులంతా వాకౌట్ చేశారు.