అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వైయస్ఆర్సీపీ బలోపేతమే లక్ష్యం
09 Sep 2017 6:30 PM
ఆమదాలవలస: గ్రామ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర హైపవర్కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలసలోని ఆయన స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్కూడలి వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న నవరత్నాల సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 237 బూత్ల పరిధిలో 2370 మంది బూత్కమిటీ సభ్యులను నియమించామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జె.జె.మోహన్రావు, బోర చిన్నంనాయుడు పాల్గొన్నారు.