రాష్ట్రవ్యాప్త నిరసనలు

అమరావతిః దళితులపై తెలుగుదేేశం పార్టీ వివక్ష మరోసారి బయటపడింది  దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా  వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టారు. తక్షణమే ఆదినారాయణరెడ్డి దళితులకు క్షమాపణలు చెప్పాలని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. కాగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదు. వారికి పదేళ్లకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. ఇపుడు అది ఏడు పదులు దాటి ఎనిమిదో పదిలోకి వెళ్తోంది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. వారు చదువుకోరు.. శుభ్రంగా ఉండరం’టూ ఆది నారాయణరెడ్డి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు.

Back to Top