నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ నిరసనలు
27 Jan 2017 10:30 AM
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ వరప్రసాద్ పాల్గొన్నారు.
గురువారం కొవ్వొత్తుల ర్యాలీపై పాశవికంగా వ్యవహరించిన తీరుగానే.. శుక్రవారం నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అమర్నాథ్ సహా జానకీరామరాజు, గొర్లి సూరిబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షుడు శకంర్ నారాయణను సైతం పోలీసులు గృహ నిర్భంధం చేశారు.