19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
ప్రజా సమస్యలను పరిష్కరించడంలోటీడీపీ విఫలం
19 Feb 2018 1:34 PM
శ్రీకాకుళం: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి హాజరైన రెడ్డి శాంతి వంశధార నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామన్న బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా చేయడం లేదన్నారు. ఎన్నికల ముందు 600లకు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ముఖ్యంగా రైతులు అయితే బాబు పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలను మోసం చేసిన బాబుకు వాళ్ల ఉసురు కచ్చితంగా తగులుతుందని హెచ్చరించారు.