వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
19 Mar 2015 1:39 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ చేసింది. స్పీకర్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు బడ్జెట్పై మాట్లాడుతుండగానే సమయం ముగిసిందంటూ మైక్ కట్ చేయటం బాధాకరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
తాము ఏం మాట్లాడాలో కూడా స్పీకర్ ఆదేశిస్తే ఎలా అన్నారు. రైతు సమస్యలపై మాట్లాడితే వినే ఓపిక ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి స్పీకర్ను ఎప్పుడూ చూడలేదని, అధికార పక్షం చెప్పినట్లుగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ జగన్ ... స్పీకర్కు, సభకు దండం పెడుతూ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.