సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
ప్రజల్లో వ్యతిరేకతను చూసే బాబు మాట మార్చారు
08 Mar 2018 12:26 PM
హైదరాబాద్: కేవలం ప్రజల్లో వ్యతిరేకతను చూసే చంద్రబాబు మాట మార్చారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వైయస్ జగన్ బాటలోకి వచ్చినందుకు సంతోషమన్నారు. కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 25 మంది ఎంపీలు ఒకే మాట మీద ఉన్నారని చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కేంద్రాన్ని తప్పుపట్టాలంటే ఏపీ ఎంపీలంతా ఒక్కటిగా ఉండాలన్నారు. వేచి చూసే దోరణి కాకుండా ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్ జగన్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని, మార్చి 21న వైయస్ఆర్సీపీ ఎంపీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ ఎంపీలు మద్దతివ్వాలని కోరారు. లేదంటే టీడీపీ అవిశ్వాసం పెట్టినా మేం మద్దతిస్తామన్నారు.