రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మోదీకి హోదా సెగ తగలకుండా బాబే కాపాడుతున్నారు
17 Apr 2018 3:55 PM
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యేక హోదా ఆందోళనల సెగ తగలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరుతో ఢిల్లీకి వెళ్లి.. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆయన డీల్ కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కథువా, ఉన్నావ్ లైంగిక దాడుల ఘటనలపై దేశమంతటా ఆందోళనలు చెలరేగుతుంటే.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మొక్కుబడి ప్రకటనలు ఇచ్చి మిన్నకుండిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రతి ప్రాంతం కథువాలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి మొదలు.. అనేక ఘటనలు జరిగినా.. ఒక్క బాధిత మహిళకు కూడా చంద్రబాబు ఎలాంటి భరోసా ఇవ్వలేదని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలోనూ సమగ్ర విచారణ జరపకుండా టీడీపీ నేతలు, వారి అనుచరులను చంద్రబాబు కాపాడుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.