వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం
25 Jun 2018 4:46 PM
– సామాన్యుల భూములు లాక్కుని..రియల్ ఎస్టేట్ వ్యాపారం
– సింగపూర్కు భూములు ధారాదత్తం చేశారు
– రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక పడలేదు
– లింగమనేని ఎస్టేట్లో బాబు, లోకేష్ల వాటా ఎంతో తేల్చాలి
– రాజధాని భూములు, లింగమనేని ఎస్టేట్పై సీబీఐ విచారణ జరపాలి
– సీపీఐ రామకృష్ణ చంద్రబాబు తొత్తు
విజయవాడ: రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని వైయసార్సీపీ అధికార ప్రతినిధి, సంతనూతలపాడు సమన్వయకర్త టీజô ఆర్ సుధాకర్బాబు విమర్శించారు. రైతుల వెన్ను విరిచారు..రైతు కూలీల ఉపాధి పోగొట్టారని, సామాన్యుల భూములు లాక్కొని సింగపూర్కు ధారదత్తం చేశారని మండిపడ్డారు. లింగమనేని ఎస్టేట్ అక్రమ కట్టడమని, అందులో చంద్రబాబు నివాసం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. లింగమనేని ఎస్టేట్, రాజధాని భూములపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. సోమవారం విజయవాడలో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో సామాన్యుల భూములు లాక్కుని..వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను సింగపూర్కు కారు చౌకగా ధారదత్తం చేశారన్నారు. అట్టహాసంగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాలుగేళ్లలో ఏం చేయలేదన్నారు. లింగమనేని ఎస్టేట్ అక్రమ కట్టడమని, అలాంటి ఇంటిలో ముఖ్యమంత్రి నివాసం ఉండటం సరికాదన్నారు. 2014 కంటే లింగమనేని ఆస్తులు, ఆదాయం, ఆ తరువాత ఉన్న వాటిపై విచారణ చేపట్టాలన్నారు. మా వద్ద అన్ని అధారాలున్నాయని, సీబీఐ విచారణ ఏర్పాటు చేస్తే మేం సమర్పిస్తామన్నారు. టీడీపీ నేతలు దోపిడీ దొంగలని, పేదల భూములు లాక్కున్నారన్నారు. ఒక రేషన్కార్డుకు రూ.2500 పింఛన్ ఇచ్చి వారి జీవితాలను సర్వనాశనం చేశారన్నారు. సామాన్యుల భూములపై లింగమనేని రమేష్ కన్నుపడిందన్నారు. ఈ కుంభకోణంలో లోకేష్ వాటా ఎంతో చెప్పాలన్నారు.
–సీపీఐ రామకృష్ణ వైయస్ జగన్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. సీపీఐ జాతీయ నాయకత్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రామకృష్ణ చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శించారు. వైయస్ జగన్కు ముఖ్యమంత్రి కావాలని రామకృష్ణ విమర్శించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలు వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఎదురుచూస్తున్నారన్నారు. వ్యాపార దృక్ఫథంతో రామకృష్ణ చంద్రబాబుకు తొత్తుగా మారారని ఆరోపించారు. వైయస్ జగన్ అడుగుపెట్టగానే కృష్ణా బ్యారేజ్, గోదావరి బ్రిడ్జీలు వణికాయన్నారు. అందుకే అందరికి భయం పట్టుకుందన్నారు.
– జనసేనతో కలిసి పోటీ చేస్తామని మేం ఎక్కడా చెప్పలేదని సుధాకర్బాబు తెలిపారు. రామకృష్ణ చంద్రబాబు మనిషి అని, ఆయన విషయంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలన్నారు. అగ్రిగోల్డు వ్యవహారంలో రామకృష్ణ మనిషి ముప్పాల నాగేశ్వరరావుకు సంబంధాలు ఉన్నాయన్నారు. మీ వద్దకు రామకృష్ణ వస్తే ఈ విషయంపై పవన్ ప్రశ్నించాలన్నారు. అగ్రిగోల్డు వ్యవహారంలో నాగేశ్వరరావుకు ఉన్న సంబంధాలు ఏంటో చెప్పాలన్నారు. నేను చేసిన ఆరోపణల్లో పస లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఆగ్రిగోల్డు వ్యవహారంలో రామకృష్ణకు ఎంత ముట్టాయో చెప్పాలని డిమాండు చేశారు.