రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
అందుకే అవినాష్రెడ్డిని అడ్డుకున్నారు
05 Jan 2018 6:11 PM
విజయవాడ: ప్రాజెక్టులపై నిజాలు చెప్పే దమ్మూ, ధైర్యం టీడీపీకి లేదని, అందుకే జన్మభూమి సభలో వైయస్ అవినాష్రెడ్డిని అడ్డుకున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు.విజయవాడలో ఆయన మీడియతో మాట్లాడుతూ టీడీపీ తీరును తూర్పారబట్టారు. మంత్రి దేవినేని ఉమకు దమ్ముంటే ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సుధాకర్బాబు డిమాండ్ చేశారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఉమ అవినీతి బాగోతం ఎవరిని అడిగినా చెబుతారని తెలిపారు. నిజాలు చెప్పే ధైర్యం ఉమకు లేదని విమర్శించారు. అందుకే పులివెందుల సభలో వైయస్ అవినాష్రెడ్డిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.