రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
హోదా పోరాటం ఉధృతం
07 Apr 2018 9:41 AM
- ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టిన వైయస్ఆర్సీపీ నేతలు
- ఎంపీల దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన..
- నేటి నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు
అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. పార్లమెంట్ చివరి బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైయస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ నెల 6వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎంపీలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. ఇవాళ్టి నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఇందులో పార్టీ శ్రేణులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వైయస్ జగన్ సూచించారు.