కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రభుత్వం ఏం చేస్తోంది?
11 May 2018 2:19 PM
శ్రీకాకుళం: మహిళలపై దాడులు జరుగుతుంటే టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, టీడీపీ నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాల్మనీ సెక్స్ రాకెట్ నుంచి ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాల వరకు విచారణకు ఆదేశించాలని తమ్మినేని సీతారాం డిమాండు చేశారు. మహిళలపై వందల లైంగిక దాడులు జరుగుతున్నాయని సీఎం డ్యాష్బోర్డులో కనిపిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి తనకు రక్షణ ఇవ్వమని అనడం చేతకానితనమన్నారు.