కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నిప్పూ.. నిజాయితీ నిరూపించుకో..
06 Jun 2018 5:14 PM
– టీడీపీ నేతలు దేశాన్ని దోచుకుతింటున్నారు
– ఎన్నో కుంభకోణాల్లో చంద్రబాబు పేరు వినిపించింది
– ఏయిర్ ఏషియా ప్రతినిధుల సంభాషణల్లో చంద్రబాబు పేరు
– సింగపూర్ లాబీకి రూ.12 కోట్లు ఇచ్చింది వాస్తవమా? కాదా?
– రాజేందర్ దూబేతో చంద్రబాబు పలుసార్లు భేటీ
విజయవాడ: చంద్రబాబు నిప్పు అని చెప్పుకుంటుంటారని, అశోక్గజపతిరాజు నీతిమంతుడని ప్రచారం చేసుకుంటారని, అయితే ఏయిర్ ఏషియా కుంభకోణంలో నిప్పు..నిజాయితీ ఏమయ్యాయని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఏయిర్ ఏషియా కుంభకోణంలో తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అశోక్గజపతి రాజు తనతో చెప్పారని, చంద్రబాబు దేశానికి ప్రధాని స్థాయి ఉన్న వ్యక్తి అన్నారు. అశోక్గజపతి రాజు నాకు చాలా పరిచయం, ఆయన్ను ప్రసన్నం చేసుకోండి ఏమి కావాలో చంద్రబాబు చేస్తారన్న సంభాషణలు విన్నామన్నారు. చంద్రబాబు ఎన్నో కుంభకోణాల్లో ఉన్నారన్నారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే కోర్టుల నుంచి చంద్రబాబు స్టేలు తెచ్చుకొని తప్పించుకుంటున్నారన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడిగా మేలి ముసుగు కప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఏయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు వెలుగులోకి వచ్చిందన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి పొందేందుకు ఏయిర్ ఏషియా అక్రమ మార్గంలో వెళ్లేందుకు చంద్రబాబును దళారీగా ఎంచుకున్నారన్నారు. 2014 నుంచి ఏయిర్ ఏషియా ప్రతినిధులు ఇందుకోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శాండిల్య, టోనీ పెర్నాండేజ్ల సంభాషణల అనంతరం 2016 మే 20న ఓ జీవోను కేంద్రం జీవోను విడుదల చేసిందన్నారు. ఐదేళ్ల కాల పరిమితి అక్కర్లేదు..రెండేళ్లు చాలు అన్నది వాస్తవమా? కాదా అని ప్రశ్నించారు. సింగపూర్లో ఉన్న హెచ్ఎన్ఆర్ ట్రెడింగ్ కంపెనీకి రూ.12 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ కంపెనీతో టీడీపీ పెద్దలకు సంబంధాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించారు. హెచ్ఎన్ఆర్ కంపెనీకి చెందిన రాజేంద్ర దుబే సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లినప్పుడు ఆయనతో పాటు ఉన్నారా? లేదా అని, వీటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు.
దేశాన్ని దోచుకుతినేందుకు చంద్రబాబు స్కేచ్ వేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇప్పటికే కొల్లగొట్టిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ దేశాన్ని దోచే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. విమానాయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజును అడ్డుపెట్టుకొని చంద్రబాబుఅవినీతికి పాల్పడ్డారన్నారు. ఏయిర్ క్రాప్ట్ విడిభాగాల కొనుగోలుకు సంబంధించి, రక్షణ శాఖకు సంబంధించి ఆయుధాల విడిభాగాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని జాతీయ మీడియాలో ప్రసారం అయ్యిందన్నారు. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీతో అశోక్ గజపతిరాజు ఓఎస్డీ అప్పారావుకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ ఓఎస్డీ నారా లోకేష్కు అత్యంత అప్తుడని చెప్పారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన ఏయిర్పోర్టులో అవినీతికి పాల్పడ్డారన్నారు. విమానయాన శాఖలో ఈ నాలుగేళ్లలో అవినీతి జరిగిందని విమర్శించారు. తప్పులు చేసి ఇవాళ పెద్ద మనిషిలా చెలామని అవుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, అశోక్గజపతిరాజు ఏయిర్ ఏషియా కుంభకోణంపై ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. మీరే నిస్వార్థపరులు, నీతిమంతులైతే నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.