వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి'
11 Sep 2015 5:46 PM
హైదరాబాద్ః రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని తెలంగాణ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ క్రిష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం మీద రైతాంగానికి నమ్మకం పోయిందని క్రిష్ణారెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను సీఎంగానీ, మంత్రులుగానీ పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రైతు సమస్యలపై హైదరాబాద్ లో మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం ఎంతో చేశారని పార్టీ నేత శివకుమార్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 421 జీవో తీసుకొచ్చి రూ. లక్షన్నర పరిహారం అందించారని చెప్పారు. రైతు క్షేమంగా ఉంటేనే ప్రపంచం బాగుంటుందని రాజశేఖర్ రెడ్డి గుర్తించారని శివకుమార్ తెలిపారు. ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు.
చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు.. రైతు కూలీలకు ఉపాధి.. ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు.