కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
జూన్ 2న రైల్ రోకో
23 May 2016 3:15 PM
విశాఖపట్నంః టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు ఒక్క విభజన హామీ కూడా సాధించలేకపోయిందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రత్యేకహోదా, రైల్వే జోన్ సహా ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత వల్లే విశాఖకు రైల్వే జోన్ రావడం లేదని ఆగ్రహించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూన్ 2న రైల్ రోకో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత వాతావరణంలో రైల్ రోకో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అఖిలపక్ష నాయకులు, మేధావులు, విద్యార్థులు అందరినీ రైల్వే జోన్ సాధనలో భాగస్వాములు చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ సూపర్బజార్ కాలపరిమితిని పెంచుతూ ప్రభుత్వాధికారులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం విశాఖ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.