ఫిలడెల్ఫియా లో మ‌హానేత వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

ఫిల‌దెల్ఫియా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎనిమిదో వర్ధంతి కార్య‌క్ర‌మం ఫిలడెల్ఫియాలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  డాక్టర్ వైయ‌స్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్(అమెరికా) ఆధ్వర్యంలో మెగా ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు,  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోశాల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి, పార్టీ అమెరికా కన్వీనర్ రత్నాకర్, రీజినల్ ఇన్‌చార్జి రమేష్ రెడ్డి, నాట్స్ మాజీ అధ్యక్షులు గంగాధర్ దేసులు హాజరయ్యారు. 

ఈ రక్తదాన శిబిరంలో 150 మంది రక్త దానం చేయగా, 400మందికిపైగా పాల్గొని వైయ‌స్‌ఆర్‌కి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో ట్రెజరర్ విష్ణు కోటంరెడ్డి, జాయింట్ సెక్రటరీ రఘురామి రెడ్డి ఏటుకూరి, శివ మేక, పూర్వ సెక్రటరీ హరి వెళ్కూర్, బోర్డు సభ్యులు ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, నాటా సెక్రటరీ శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, వైఎస్ఆర్ అభిమానులు మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్లం, గీత దోర్నాదుల, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, నాగరాజా రెడ్డి, జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, అంజి రెడ్డి సాగంరెడ్డి, రవి మరక, భానోజీ రెడ్డి, హరి కురుకుండ, వంశి బొమ్మారెడ్డి, ధీరజ్ రెడ్డిలు పాల్గొన్నారు.
Back to Top