రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఎంపీల దీక్షకు సీపీఐ మద్దతు
11 Apr 2018 12:01 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎంపీల దీక్షకు బుధవారం సీపీఐ మద్దతు తెలిపారు. ఏపీ భవన్లో ఎంపీల దీక్షాస్థలిని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైయస్ఆర్సీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేశారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా పారిపోయిందన్నారు. ఇవాళ బీజేపీ మొసలి కన్నీరు కార్చుతుందన్నారు. ప్రభుత్వాల నియంతృత్వ పోకడలు సరికాదన్నారు. ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.