రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పార్టీ ఎంపీలతో రేపు వైయస్ జగన్ భేటీ
25 Mar 2018 10:49 PM
సత్తెనపల్లి : పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు, అవిశ్వాస తీర్మానం తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించడానికి వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రె్డ్డి సోమవారం ఉదయం పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పళ్ల గ్రామంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ప్రత్యేక హోదా సాధనకు పోరాడుతున్న ఎంపిలు లోకసభలో వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తునప్పటికీ చర్చకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు, జాతీయ స్థాయి పరిణామాలపై ఎంపీలతో వైయస్ జగన్ చర్చించి, తదుపరి కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు.
.
పాదయాత్రకు విరామం
శ్రీరామ నవమి పర్వ దినం సందర్భంగా సోమవారం ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రకు విరామం ప్రకటించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.