మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
లోక్ సభలో వైయస్సార్సీపీ ఎంపీల ఆందోళన
01 Aug 2016 12:29 PM
న్యూఢిల్లీః ఏపీకి ప్రత్యేకహోదాపై లోక్ సభ దద్దరిల్లింది. రాష్ట్రానికి హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఎంపీలు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. హోదా ఇవ్వాలని స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం లోక్ సభలో వైయస్సార్సీపీ వాయిదా తీర్మాన నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పోడియం వద్ద వైయస్సార్సీపీ ఎంపీలు హోదాపై చర్చకు పట్టుబట్టారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినదాలతో హోరెత్తించారు. ఏపీకి ప్రత్యేకహోదాను ప్రకటించాల్సిందేనంటూ గట్టిగా పట్టుబట్టారు. పట్టువదలని విక్రమార్కుల్లా వైయస్సార్సీపీ ఎంపీలు చర్చకు పట్టబడడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.