రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాబువన్నీ లాలూచీ రాజకీయాలే
23 Mar 2018 1:04 PM
వైయస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: చంద్రబాబు నాయుడు మొదటి నుంచి లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా ఎన్డీయేతో కలిసి బహిరంగంగా కాపురం చేసిన టీడీపీ... ఇప్పుడు లోపాయకారంగా చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ, పోలవరం నిధుల గురించి సుజనా చౌదరి కేంద్రమంత్రి అరుణ్జైట్లీతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయన్నారు. పోలవరం, ప్యాకేజీ అంటూ మళ్లీ హోదా కోసం పోరాటం అంటూ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారన్నారు. ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మభ్యపెడతారని మండిపడ్డారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాం.. వైయస్ఆర్ సీపీ, బీజేపీ కలిసిపోయాయని ఆరోపణలు చేసిన చంద్రబాబు రహస్యభేటీపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.