అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చంద్రబాబుకు విజయసాయిరెడ్డి మరో సవాలు
13 Jun 2018 4:14 PM
హైదరాబాద: టీటీడీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. దర్యాప్తులో చంద్రబాబు నిర్దోషి అని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని విజయసాయిరెడ్డి సవాలు విసిరారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు అందితే చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. చంద్రబాబుకు మరో సవాలు విసిరారు. 13 గంటల గడువు ఇస్తే 240 గంటల తరువాత స్పందించి టీటీడీ నుంచి నోటీసులు అందించారని చెప్పారు. నోటీసులు ఇచ్చే అర్హత టీటీడీకి లేదన్నారు.