బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
తిరుమల ఆభరణాలను విదేశాలకు తరలించే అవకాశం
23 May 2018 11:48 AM
విశాఖ: తిరుమలలోని నేలమాళిగలో దొరికిన విలువైన అభరణాలను అమరావతి, హైదరాబాద్లోని సీఎం ఇంటికి తరలించే అవకాశం ఉందని, 12 గంటలకు మించి సమయం ఇస్తే తిరుమల ఆభరణాలను చంద్రబాబు విదేశాలకు తరలించే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 13 గంటల్లోగా ఆభరణాల గురించి తేల్చకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. వేల మంది పోలీసులను పెట్టుకున్నా..ప్రజాభిమానం ఉన్న వైయస్ఆర్సీపీని చంద్రబాబు అడ్డుకోలేరన్నారు. హెరిటేజ్తోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే చంద్రబాబుకు సాధ్యం కాదని, లోకేష్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్న చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. తిరుమల పోటులో మరమ్మతుల పేరుతో 20 రోజుల పాటు కార్యాకలాపాలను రద్దు చేశారన్నారు. ఆభరణపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు.