మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది
11 May 2018 1:19 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా ఈ నెల 14, 15వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురంలో శుక్రవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మిథున్రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను దగా చేశారని మండిపడ్డారు. రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనత బాబుదే అన్నారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలను విజయవంతం చేయాలని మిథున్రెడ్డి పిలుపునిచ్చారు.