రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టండి
14 Jun 2018 3:12 PM
వైయస్ఆర్ జిల్లా: కడప-బెంగళూరు రైల్వే పనుల్లో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆర్డీవో దేవేంద్రరెడ్డిని కోరారు. గురువారం రాయచోటి ప్రాంతం లో రైల్వే లైను భూసేకరణ పై రాయచోటి తహసీల్దార్ కార్యాలయం లో అధికారులు, బాధిత రైతులు తో ఆర్డిఓ దేవేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. కడప- బెంగళూరు రైల్వే లైన్ ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ అన్నారు. రైతులను మెప్పించి, ఒప్పించి భూసేకరణ చేపట్టాలని కోరారు. రైల్వే లైను పనుల్లో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు జరగకుండా చూడాలని కోరారు. భూమి కోల్పోయే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. .